రాయచోటి:రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదివారం రాయచోటి పట్టణంలోని స్టేట్ గెస్ట్ హౌస్ నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ప్రజల సమస్యలను ఓపికగా విని కొన్ని సమస్యలను అప్పటికప్పుడే సంబంధిత అధికారుతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించారు. బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించడంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. రాబోయే రోజులలో అన్నమయ్య జిల్లాను సమస్యల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని మంత్రివర్యులు తెలిపారు.
Post Views: 1