మహానాడుకు పగడ్బందీగా ఏర్పాట్లు నిర్వహిస్తున్నాం మంత్రి మండిపల్లి

కడప : రాష్ట్ర రవాణా, యువజన క్రీడ శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి మహానాడు సందర్భంగా ఆదివారం సహచర మంత్రులతో కడప పట్టణంలోని పబ్బాపురం సమీపంలో నిర్వహించే మహానాడు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. మే 27,28,29 తేదీలలో జరిగే మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజా ప్రతినిధులు, టిడిపి కుటుంబ సభ్యులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కానున్నారని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. చిన్న సమస్య కూడా తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని మహానాడు కమిటీ సభ్యులకు సూచించారు. ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా వాహన పార్కింగ్ భోజనం వసతి ఏర్పాట్లు పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మొట్టమొదటిసారిగా కడప జిల్లాలో నిర్వహించే మహానాడు సభ అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp