జ్యోతి ఉత్సవాలలో పాల్గొన్న మంత్రి మండిపల్లి

రాయచోటి ; రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శనివారం రాయచోటి మండలం, రామాపురం నందు శ్రీ శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నందు నిర్వహించిన జ్యోతి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు భక్తిశ్రద్ధలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ మండపానికి చేరుకున్న ముఖ్య అతిథులకు ఆలయ అర్చకులు వేదాశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Facebook
X
LinkedIn
WhatsApp