బిజెపి ఆధ్వర్యంలో పల్లెకు పోదా

సుండుపల్లి : అన్నమయ్య జిల్లా సుండుపల్లి బిజెపి మండల అధ్యక్షుడు యస్. వి.రమణగౌడ్ ఆద్వర్యంలో వెళ్లకు పోదాం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద గజపతి రాజు పాల్గొన్నారు. జ్యోతి రావుపూలే జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రి, అంగనవాడి కేంద్రం, ఎంపీపీ స్కూల్ ను సందర్శించారు. కొంతమంది లబ్ధిదారులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద గజపతిరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాలు మెరుగు పరచడానికి నాణ్యమైన విద్య, మద్యాహ్నం భోజనం పధకం, అంగన్‌వాడీ కేంద్రంగా పౌషిక ఆహారాలు పంపిణీ లాంటి కార్యక్రమాలు మోడీ ప్రవేశపెట్టారన్నారు. బి.జి రాచపల్లి ప్రభుత్వ ఆసుపత్రి, ఆయుష్మాన్ భారత్ కార్డులు పంపిణీపై అర్హుల అందరికీ పంపిణీ చేయాలని అధికారులను కోరారు. సీనియర్ నాయకులు రెడ్డయ్యచారి, ఉపాధ్యక్షులు సుధాకరా, సీనయ్యసెట్టి,వెంకట్రామ రాజు, రాజేంద్ర రాజు, రెడ్డయ్య రాజు తదితరులు పాల్గొన్నారు. రాయవరంలో పల్లెకు పోదాంను రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. పలు కార్యాలయాలు సందర్శించి గ్రామంలో ఉన్న సమస్యలు త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ కార్యక్రమం కు రాజంపేట అసెంబ్లీ కన్వీనర్‌ రామజగదీష్ స్వామి పాల్గొన్నారు

Facebook
X
LinkedIn
WhatsApp